సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు

 సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు

ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరో వారంపాటు మధ్యంతర బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ అత్యవసర పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ JK మహేశ్వరి, కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం.. కేజ్రీవాల్ పిటిషన్ ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తెలిపింది. కేజ్రీవాల్ పిటిషన్ పై తదుపరి ఆదేశాల కోసం.. CJI డీవై చంద్రచూడ్ కు పంపుతున్నట్లు వెకేషన్ బెంచ్ వెల్లడించింది.  

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మనిలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే,అనారోగ్య కారణాలు దృష్ట్యా  తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించగా.. జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  అయితే.. మరో 7 రోజుల పాటు తనకు బెయిల్ గడువును పొడిగించాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు.