బీబీసీ డాక్యుమెంటరీ..కేంద్రానికి సుప్రీం నోటీసులు

బీబీసీ డాక్యుమెంటరీ..కేంద్రానికి సుప్రీం నోటీసులు

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.  ప్రధాని మోడీపై బీబీసీ  డాక్యుమెంటరీని కేంద్రం నిషేదించడాన్ని  సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ ఇండియా ది క్వశ్చన్ ను నిషేదిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం ఇవాళ విచారణ జరిపింది. పిటిషన్లను విచారించిన సుప్రీం చీఫ్ జస్టిస్   డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం  ఆ డాక్యుమెంటరీపై నిషేధానికి సంబంధించిన ఒరిజినల్‌ రికార్డులను మూడు వారాల్లోగా  కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.  కేసు తదుపరి విచారణను  ఏప్రిల్‌ లో విచారిస్తామని చెప్పింది.

2002 గుజరాత్ అల్లర్లపై   రూపొందించిన  వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని  నిషేదిస్తూ  కేంద్రం కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది.  అయితే  ప్రముఖ జర్నలిస్ట్ ఎన్ రామ్, కార్యకర్త -లాయర్ ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం నోటీసులు జారీ చేసింది.