హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సీడబ్ల్యూసీ ఆమోదం పొందిన డిజైన్ మేరకే కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోలేకపోతున్న తెలంగాణ, ఎలాంటి అనుమతులు లేకుండా రూ.30 వేల కోట్లు అక్రమంగా ఖర్చు చేసి అదనపు టీఎంసీ పనులు చేస్తోందని, తద్వారా ఎందరినో నిర్వాసితులను చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పలువురు నిర్వాసితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను జస్టిస్ ఏఎం కన్వీల్కర్, జస్టిస్ జేబీ పార్థీవాల బెంచ్ శుక్రవారం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతోపాటు నిర్వాసితులకు పరిహారం పంపిణీలోనూ వివక్ష చూపుతోందని పిటిషనర్ తరుఫు లాయర్ వివరించారు. వాదనలు విన్న బెంచ్.. కాళేశ్వరం విస్తరణ పనులపై కేంద్రంతోపాటు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం
- తెలంగాణం
- July 23, 2022
లేటెస్ట్
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
- ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
- బీసీల వాటా ఇవ్వకుంటే ఊరుకోం: ఆర్. కృష్ణయ్య
- రూ. 1,800 పెరిగిన వెండి ధర
- ఏఐ టెక్నాలజీతో ఎల్జీ టీవీలు
- దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు
- అర్హత లేకున్నా.. ట్రీట్మెంట్ చేస్తున్నరు
- జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలన సాగట్లే
- నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
- మే 22 న ఆఫిస్ ఐపీఓ ఓపెన్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్