ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌పై సుప్రీం స్టే

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌పై సుప్రీం స్టే

కేరళలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఆపేసింది సుప్రీంకోర్టు. కేరళలో కరోనా తీవ్రంగా ఉంది. గత వారం రోజులుగా సగటున రోజుకు 30వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 6  నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. వీటిని ఫిజికల్ గా నిర్వహించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఎగ్జామ్స్ నిలిపేసిన సుప్రీంకోర్టు... తర్వాతి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. కేరళ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సుప్రీం అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ ని రిస్క్ లో పెట్టలేమంది సుప్రీం.