బాక్సాఫీస్​ దగ్గర ‘విరూపాక్ష’కలెక్షన్ల జోరు

బాక్సాఫీస్​ దగ్గర ‘విరూపాక్ష’కలెక్షన్ల జోరు

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్​కు ‘విరూపాక్ష’ కెరీర్​ బెస్ట్ ఓపెనింగ్స్​ను తెచ్చిపెట్టింది. తొలి రోజు రూ. 12 కోట్లు, రెండో రోజు రూ.16 కోట్లు కలెక్ట్​ చేసింది. ఇక మూడో రోజు వరల్డ్​వైడ్​గా రూ.44 కోట్ల గ్రాస్​ను వసూలు చేయగా.. తెలుగు రాష్ట్రాల్లోనే 5.77 కోట్ల షేర్​ను కలెక్ట్​ చేసింది. ఓవర్సీస్​లోనూ 1 మిలియన్​ మార్క్​ దిశగా దూసుకెళ్తోంది.

ఈ సినిమా సక్సెస్​ ఏ రేంజ్​లో ఉందో అంచనా వేయెచ్చు. కార్తిక్​ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సంయుక్త మీనన్​ హీరోయిన్​గా నటించింది. సుకుమార్​ స్క్రీన్​ప్లేను అందించగా.. బివీఎస్​ఎన్​ ప్రసాద్  నిర్మించాడు.