
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్కు ‘విరూపాక్ష’ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ను తెచ్చిపెట్టింది. తొలి రోజు రూ. 12 కోట్లు, రెండో రోజు రూ.16 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు వరల్డ్వైడ్గా రూ.44 కోట్ల గ్రాస్ను వసూలు చేయగా.. తెలుగు రాష్ట్రాల్లోనే 5.77 కోట్ల షేర్ను కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లోనూ 1 మిలియన్ మార్క్ దిశగా దూసుకెళ్తోంది.
ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్లో ఉందో అంచనా వేయెచ్చు. కార్తిక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. సుకుమార్ స్క్రీన్ప్లేను అందించగా.. బివీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.