జీడిమెట్ల, వెలుగు : సూరారం కట్ట మైసమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 10 నుంచి ప్రారంభమైన జాతర ఉత్సవాలు నాలుగు రోజుల పాటు జరిగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన లక్షలాది మంది భక్తులు అమ్మవారికి దర్శించుకుని బోనాలు, ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
జాతర ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతర ఉత్సవాల్లో విధులు నిర్వహించిన పోలీసులకు, జీహెచ్ఎంసీ ఇతర శాఖల అధికారులకు ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.