
సూర్య హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘కంగువ’. దిశా పటానీ హీరోయిన్గా నటించగా, బాబీడియోల్ విలన్ పాత్ర పోషించాడు. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14న పాన్ ఇండియా వైడ్గా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో సూర్య మాట్లాడుతూ ‘ఇది ఒక ఫైటర్ సినిమా కాదు.. ఒక వారియర్ మూవీ. తన వాళ్ల కోసం, తను నమ్మిన ధర్మం కోసం పోరాడే వారియర్ మూవీ. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది.
ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని ఒక అరుదైన మూవీని చేశాం. దర్శకుడు శివ వల్లే ఇది సాధ్యమైంది. ఇలాంటి సినిమాలు చేసేందుకు దర్శకుడు రాజమౌళి గారు స్ఫూర్తినిచ్చారు. ఆయన తన చిత్రాలతో మాకు దారి చూపించారు. ఇది స్ట్రయిట్ తెలుగు సినిమా. ఇండియన్ సినిమా’ అని చెప్పారు. దర్శకుడు శివ మాట్లాడుతూ ‘వెయ్యేళ్ల కిందట ఆదిమానవుల టైమ్ నుంచి ఐదు తెగల మధ్య జరిగే పోరాటాన్ని నేపథ్యంగా ఎంచుకుని స్క్రిప్ట్ తయారు చేశాం. ట్రైలర్ చూసినప్పుడు ఎలాంటి గొప్ప ఫీలింగ్ కలిగిందో థియేటర్లోనూ అలాంటి అనుభూతికి లోనవుతారు’ అని అన్నాడు. సినిమా విజయం పట్ల కాన్ఫిడెంట్గా ఉన్నామని నిర్మాత జ్ఞానవేల్ రాజా అన్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి, రైటర్ రాకేందు మౌళి పాల్గొన్నారు.