సత్య లీడ్ రోల్లో రితేష్ రానా రూపొందించిన చిత్రం ‘జెట్లీ’. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించారు. మే 1న విడుదలైంది. సినిమాకొస్తున్న రెస్పాన్స్ తెలియజేస్తూ శనివారం ప్రెస్మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ ‘థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. వాళ్ల ప్రేమ చూసి చాలా ఎమోషనల్ అయ్యాను.
ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. దర్శకుడు రితేష్ మాట్లాడుతూ ‘నాకు రొటీన్కు భిన్నంగా ఉండే సినిమాలు చేయాలని ఉంటుంది. అలాంటి ఐడియాలు ఎప్పుడు చెప్పినా, నాకంటే చెర్రీ గారు ఎక్కువ ఎక్సయిట్ అవుతారు. ఈ కథ కూడా ఆయనకి చాలా నచ్చింది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్పెషల్ థ్యాంక్స్’ అని అన్నాడు.
నిర్మాత చెర్రీ మాట్లాడుతూ ‘ఎవరూ ప్రయత్నించని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా ఇది. ఈ సినిమా ప్రేక్షకుల మధ్య సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. థియేటర్ల నుంచి యూనానిమస్గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ కూడా బావున్నాయి’ అని చెప్పారు. నటులు అజయ్, గుండు సుదర్శన్ పాల్గొన్నారు.
