
కొత్త తరహా కథలు, ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యతను ఇచ్చే సూర్య.. ప్రస్తుతం ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ‘శౌర్యం’ శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో త్రీడీలో రూపొందిస్తున్నారు. సూర్య కెరీర్లో ఇది 42వ చిత్రం. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మూవీ టైటిల్ అనౌన్స్మెంట్కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ నెల 16న ఉదయం 9.05 నిముషాలకు టైటిల్ను రివీల్ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ఆయుధాలతో గుర్రంపై స్వారీ చేస్తున్న ఓ యోధుడు ఒక కొండ చివరి నుండి మరో కొండ పైకి జంప్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ను డిజైన్ చేశారు. దిశాపటాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసే ప్లాన్లో ఉన్న సూర్య.. చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చెన్నై వెళ్లి ఓ స్టోరీ కూడా వినిపించాడట చందు. త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్ట్పై క్లారిటీ రానుంది.