
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సూర్య కెరీర్లో ఇది 46వ చిత్రం. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. బుధవారం ఈ బైలింగ్వల్ మూవీ షూటింగ్ను హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ‘సెలబ్రేషన్, ఎమోషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వైపు తొలి అడుగు’ అంటూ సూర్య ముందడుగు వేస్తున్న పోస్టర్ను విడుదల చేశారు.
‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు ఇందులో సూర్యకు జంటగా నటిస్తోంది. రవీనా టాండన్ టాలీవుడ్కు రీఎంట్రీ ఇస్తుండగా రాధిక శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. నవీన్ నూలి ఎడిటర్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. ‘లక్కీ భాస్కర్’ లాంటి సూపర్ హిట్ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు నెలకొన్నాయి.