2020 నాటికి 62.2 కోట్ల యూజర్లు
నాలుగేళ్లలో 45 శాతం గ్రోత్!
న్యూఢిల్లీ: మన దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2025 నాటికి 90 కోట్లకు చేరుతుందని ఒక రిపోర్టు వెల్లడించింది.2020 నాటికి దేశంలో ఇంటర్నెట్ యూజర్లు 62.2 కోట్లని ఐఏఎంఏఐ, కంటార్ రీసెర్చ్ రిపోర్టు తెలిపింది. అంటే నాలుగేళ్లలో 45 శాతం పెరుగుతుందని అంచనా వేస్తోంది. అర్బన్ ఏరియాలలో ఇంటర్నెట్ రీచ్ ఎక్కువగా ఉందని, రూరల్ ఏరియాలతో పోలిస్తే ఇది రెండు రెట్లు కంటే ఎక్కువేనని పేర్కొంది. అర్బన్ సెంటర్లలో ఇంటర్నెట్ యూజర్లు 32.3 కోట్లని, అర్బన్ జనాభాలో ఇది 67 శాతానికి సమానమని వివరించింది. 2020 నాటికి రూరల్ ఏరియాలలోని ఇంటర్నెట్ యూజర్లు 29.9 కోట్లు మాత్రమేనని, అంటే మొత్తం రూరల్ జనాభాలో 31 శాతం మందికి మాత్రమే నెట్ యాక్సెస్ ఉందని రిపోర్టు తెలిపింది. రాబోయే ఏళ్లలో రూరల్ ఏరియాలోని ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య బాగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. లోకల్ లాంగ్వేజ్, వాయిస్, వీడియోలు, డిజిటల్ ఎకో సిస్టమ్లో ముఖ్యమైనవవుతాయని కంటార్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విశ్వప్రియ భట్టాచార్జీ చెప్పారు. ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి పదిమందిలోనూ 9 మంది రోజూ నెట్ వాడుతున్నారని, ఏవరేజ్గా 107 నిమిషాలు నెట్టింట్లోనే గడుపుతున్నారని రిపోర్టు వివరించింది. దేశంలో ఇంటర్నెట్ గ్రోత్కు ప్రధాన కారణమం మొబైల్ ఫోన్లేనని ఈ రిపోర్టు తేల్చింది. వినోదం, కమ్యూనికేషన్, సోషల్ మీడియా కోసమే ఎక్కువగా ఇంటర్నెట్ను వాడుతున్నారని తెలిపింది.