IPL 2024: సూర్య ఎమోషనల్ పోస్ట్..ఆందోళనలో అభిమానులు

IPL 2024: సూర్య ఎమోషనల్ పోస్ట్..ఆందోళనలో అభిమానులు

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. ఈ ముంబై స్టార్ తొలి రెండు మ్యాచ్ లకు అందుబాటులో ఉండడని నివేదికలు చెబుతున్నాయి. ఇంతవరకు తెలిసిన విషయమే అయినా తాజాగా అతను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఎమోజి ముంబై ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తుంది. 

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్ పై ఇంకా స్పష్టత రాలేదు. ఖచ్చితంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో చెప్పలేని పరిస్థితి. దీనికి తోడు హార్ట్‌బ్రేక్ ఉన్న ఎమోజీని పోస్ట్ చేయడంతో అతని భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతను ఇంకా హెర్నియా శస్త్రచికిత్స నుండి ఇంకా కోలుకోలేదా..? లేకపోతే ఫిట్ నెస్ ఎప్పుడు సాధిస్తాడు? అనే విషయాలపై ఎవరూ ఒక అంచనాకు రాలేకపోతున్నారు. 

సూర్య లాంటి స్టార్ బ్యాటర్ లేకపోతే ముంబై ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సూర్య.. 2024 జనవరి నెలలో జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఐపీఎల్ సమయానికి అందుబాటులో ఉంటాడనుకున్నా అది జరగలేదు. ఐపీఎల్ లో అత్యంత నిలకడగా రాణించే వారిలో సూర్య కూడా ఒకడు. ఇప్పటివరకు 139 మ్యాచ్ ల్లో 3289 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మార్చి 24 న ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ తో తొలి మ్యాచ్ లో తలబడుతుంది.