
అమెరికాలోని కొలరాడోలో వారానికొకసారి జరిగే యూదుల సమావేశంపై ఫ్లేమ్ త్రోవర్ దాడి జరిగింది. ర్యాలీ నిర్వహిస్తున్న అమెరికన్ యూదుల సమూహంపై ఓ వ్యక్తిం ఫ్లేమ్ త్రోవర్ తో దాడి చేశాడు. ఈ దాడిలో ఆరుగురికి మంటలంటుకొని గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ర్యాలీలో పాల్గొన్న వారంతా 60యేళ్లకు పైబడిన వారే. యూదుల ర్యాలీపై దాడిని ఉగ్రవాద చర్యగా FBI దర్యాప్తు చేస్తోంది.
నిందితుడు మహ్మద్ సబ్రీ సోలిమాన్ ఫ్లేమ్ త్రోవర్ ను ర్యాలీ గుంపుపై విసిరాడని అనంతరం ఫ్రీ పాలస్తీనా అని నినాదాలు చేశాడని FBI డెన్వర్ స్పెషల్ ఏజెంట్ తెలిపారు.
దాడి: యాంటీ-డిఫమేషన్ లీగ్ ప్రకారం..ఆదివారం (మే1) కొలరాడోలోని బౌల్డర్లో జరిగిన యూదుల ర్యాలీపై దుండగులు ఫ్లేమ్ త్రోవర్ తో దాడి చేశాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో జరిగిన దాడుల సమయంలో బంధించబడిన వారిని విడుదల చేయాలని అమెరికాలోని యూదులు వారానికోసారి ర్యాలీ నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆదివారం బౌల్డర్ రన్ ఫర్ దెయిర్ లైవ్స్ ర్యాలీలో ఈ సంఘటన జరిగింది.
ఆదివారం జరిగిన దాడిలో 67 నుంచి 88 సంవత్సరాల వయస్సు గల ఆరుగురు గాయపడ్డారని FBI తెలిపింది. వీరిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను బౌల్డర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.
నిందితుడు సోలిమాన్(45) యూదుల ర్యాలీపై ఒక్కడే దాడి చేశాడు.. 2005లో అమెరికాలో ప్రవేశించేందుకు సోలిమాన్ కు వీసా నిరాకరించారని అనుమానితుడు యూఎస్ లో ఎలా ప్రవేశించాడో స్పష్టత లేదని FBI అధికారులు తెలిపారు. సోలిమాన్ పై పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తెలిపారు.