
కోల్కతా: బెంగాల్ ఓటర్ల లిస్ట్లో 1.25 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు. ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) తర్వాత వారిని వెనక్కి పంపుతామని ఆయన తెలిపారు. పుర్బా మెదినీపూర్ జిల్లాలోని తమ్లుక్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి ప్రసంగించారు.
మతపరమైన హింస వల్ల ఆశ్రయం కోరి వచ్చిన హిందువులు ఈ ప్రక్రియ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.