
Suzlon Energy Shares: రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో చాలా మంది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకట్టుకున్న షేరుగా సుజ్లాన్ ఎనర్జీనికి ఉంది. రూ.100 కంటే తక్కువ ధరలో ఉన్న ఈ స్టాక్ కొన్ని సంవత్సరాల కిందట చాలా తక్కువ ధరను కలిగిన పెన్నీ స్టాక్. భవిష్యత్తు గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ లక్ష్యంగా ప్రపంచ దేశాలు ముందుకెళుతున్న క్రమంలో షేరుపై బెట్టింగ్ వేసే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం బ్రోకరేజీలు కూడా ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చినట్లు తమ రేటింగ్ మార్పుల ద్వారా చెబుతున్నాయి.
అయితే తాజాగా సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లపై దేశీయ బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ తన రేటింగ్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఇచ్చిన కొనుగోలు రేటింగ్ నుంచి ప్రస్తుతం అక్యూమిలేట్ రేటింగ్ కి తగ్గించింది. శుక్రవారం మార్కెట్ల క్లోజింగ్ సమయంలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.64.74 వద్ద బీఎస్ఈలో స్థిరపడింది. ఇదే క్రమంలో బ్రోకరేజ్ కంపెనీ షేర్లు రానున్న కాలంలో రూ.71 స్థాయికి చేరుకోవచ్చని అంచనాను పంచుకుంది. దీనికి ముందు గతంలో కంపెనీ షేర్లకు అందించిన టార్గెట్ ధర రూ.77 కంటే రూ.6 తగ్గింపును ప్రస్తుతం ప్రకటించటం గమనార్హం.
ప్రస్తుతం కంపెనీ ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండటంతో పాటు భారీగా ఆర్డర్ బుక్ కలిగి ఉంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.వెయ్యి 181 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.86.04గా ఉన్న సంగతి తెలిసిందే.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.