జపాన్ సుజుకి కార్ప్ ప్రకటన
న్యూఢిల్లీ : ఇండియాలో 2030 లోపు ఆరు ఎలక్ట్రిక్ కార్లను తేనున్నట్లు జపాన్ కంపెనీ సుజుకి మోటార్ కార్పొరేషన్ గురువారం ప్రకటించింది. గ్రోత్ స్ట్రేటజీలో భాగంగా ఈ నిర్ణయాన్ని కంపెనీ తీసుకుంది. సుజుకి మోటార్ కార్పొరేషన్ మన దేశంలో మారుతి సుజుకి ఇండియా ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జపాన్ సంస్థ గ్రోత్ స్ట్రేటజీని ఇండియాలోని మారుతి సుజుకి బీఎస్ఈకి పంపించింది.
2030 నాటికి పోర్ట్ఫోలియోలో 15 శాతం బ్యాటరీ ఈవీలు ఉండేలా చొరవ తీసుకోనున్నట్లు సుజుకి మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. 2023 ఆటో ఎక్స్పోలో ప్రదర్శనకు పెట్టిన బ్యాటరీ ఎస్యూవీని ఇండియా మార్కెట్లో 2024 లో లాంఛ్ చేయనున్నట్లు తెలిపింది. ఇండియాలో బయోగ్యాస్ బిజినెస్ పైనా ఫోకస్ పెట్టనున్నట్లు ఈ జపాన్ కంపెనీ పేర్కొంది.