నన్ను టార్గెట్ చేశారు..ఉద్యోగినితో ఫోన్ కాల్ పై పృథ్వీ రియాక్షన్

నన్ను టార్గెట్ చేశారు..ఉద్యోగినితో ఫోన్ కాల్ పై పృథ్వీ రియాక్షన్

మహిళా ఉద్యోగితో మాట్లాడిన ఆడియో టేప్ వైరల్ కావడంపై స్పందించారు ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్. తాను ఏ మహిళతో ఫోన్ లో మాట్లాడలేదని..ఆ ఆడియో తనది కాదన్నారు. తనకు ఎవరితో సంబంధాలు లేవన్నారు. ఎవరో కావాలని తనపై దుష్రచారం చేశారని అన్నారు. తాను ఎస్వీబీసీ ఛైర్మన్ కావడం చాలా మందికి ఇష్టం లేదని..అందుకే ఎవరో ఓర్వలేక తనపై ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు .ఆ మహిళా ఎవరో తనకు తెలీదన్నారు. అందులో ఉన్న వాయిస్ తనది కాదని..దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు . విచారణతో తాను తప్పు చేసినట్లు రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. తాను మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటానన్నారు. కావాలంటే ఎస్వీబీసీ లో పనిచేసే ఉద్యోగులను అడిగి తెలుసుకోవాలన్నారు. తనను ఎవరో కావాలనే టార్గెట్ చేశారని అన్నారు.

నువ్వు గుండెల్లో ఉన్నావ్, ఐలవ్యూ.. ఉద్యోగినితో పృథ్వీ ఫోన్ కాల్ వైరల్