తిరుపతిలో వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం

తిరుపతిలో వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం

తిరుమల శ్రీవారి దర్శనం కోసం మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంక స్వామి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎస్వీయూ పాలక మండలి సభ్యులు మధు ఆధ్వర్యంలో పలువురు దళిత సంఘాల నేతలు వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి, శాలువాలు, గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు కాకాతో తమకున్న అనుబంధాన్ని వివేక్తో పంచుకున్నారు.