
హైదరాబాద్, వెలుగు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కోరుతూ స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు మంగళవారం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా డిమాండ్లను యూనియన్ నేతలు సీఎంకు వివరించారు. హెల్త్ కార్డులు జారీ చేయాలని, కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని విన్నవించారు. ఆ తర్వాత ఆటో టిప్పర్ కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడారు. తమ సమస్యలపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారని, కార్మికులకు ఎళ్ల వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు.