ఒడిశా పూరీ బీచ్లో స్వచ్ఛ్ భారత్ సైకత శిల్పం

ఒడిశా పూరీ బీచ్లో స్వచ్ఛ్ భారత్ సైకత శిల్పం

స్వచ్ఛతా హి సేవా 2023 ప్రచారంలో భాగంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో అందమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు.. స్వచ్ఛ్ భారత్ కోసం ఏకమవుదాం.. మన పరిసరాలను శుభ్రం చేసేందుకు  ప్రతిజ్ఞ చేద్దాం అని అన్నారు సుదర్శన్ పట్నాయక్. స్వ చ్ఛ్ భారత్ సైకత శిల్పానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్.

మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఈ కార్యక్రమం చేపట్టబడింది. కళాకారులుగా మేం మా కళ ద్వారా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ తెలిపారు.