
- గత ఏడాది బిచ్కుందలో ఏటీసీ సెంటర్ షురూ
- కొత్తగా ఎల్లారెడ్డి, తాడ్వాయి ఏటీసీల్లో అడ్మిషన్లు
- ఈ నెల 31 వరకు ఆన్లైన్లో అప్లయ్కు అవకాశం
కామారెడ్డి, వెలుగు :టెక్నాలజీకి అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలను ఏటీసీ ( అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)లుగా అప్గ్రేడ్ చేస్తోంది. గత ఏడాది బిచ్కుందలో ఏటీసీ సెంటర్ ప్రారంభం కాగా, ఈసారి ఎల్లారెడ్డి, తాడ్వాయి సెంటర్లు షురూ కానున్నాయి. ఇప్పటికే మొదటి విడత అడ్మిషన్లు పూర్తి కాగా, రెండో విడత అడ్మిషన్లకు అవకాశం ఇచ్చారు. ఈ సెంటర్లలో టి-గేట్ ( తెలంగాణ గేట్వే ఆఫ్ అడాప్టివ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్) స్కీమ్ లో అధునాతక శిక్షణ అందిస్తాయి.
ఆయా కోర్సుల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు అప్రెంటిస్షిప్ తో పాటు, ఉపాధి కల్పించేందుకు టి-గేట్ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయిలోని ఇండస్ర్టీస్, ఏటీసీ ప్రిన్సిపాల్స్, కార్మిక, ఉపాధి కల్పన తదితర శాఖల అధికారులు మెంటర్లుగా ఉండనున్నారు.
ఒక్కో ఏటీసీలో 6 కోర్సులు, 172 సీట్లు..
జిల్లాలో ఉన్న 3 ఏటీసీల్లో 6 కోర్సులను ప్రవేశ పెట్టారు. అన్ని కోర్సులకు కలిపి 172 సీట్లు ఉంటాయి. ఆయా సెంటర్లలో మాడ్రన్ఎక్విప్మెంట్స్తో క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోర్సులకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఉంది. బిచ్కుంద, తాడ్వాయిలలో బిల్డింగ్ల నిర్మాణాలు పూర్తై ఎక్విప్మెంట్స్ వచ్చాయి. ఎల్లారెడ్డిలో బిల్డింగ్ నిర్మాణం కొనసాగుతోంది.
ఆన్లైన్లో అప్లయ్..
ఎస్సెస్సీ పాసైనవారు ఆన్లైన్లో ఏటీసీకి అప్లయ్ చేసుకోవచ్చు. ఇప్పటికే మొదటి విడత కంప్లీట్ కాగా, రెండో విడతకు ఈ నెల 31 వరకు అవకాశం ఉంది. https.//iti.telangana.gov.in వెబ్సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. ఆగస్టు ఫస్ట్ వీక్లో సీట్లు కేటాయిస్తారు. ఆయా చోట్ల ఇంకా సీట్లు మిగిలి ఉంటే మూడో విడత కౌన్సిలింగ్ లేదా స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఉంది.
ఏటీసీల్లో కోర్సుల వివరాలు..
మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ర్టియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్స్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వైరిఫైరియర్ ( మెకానికల్), అడ్వాన్స్ సీఎస్సీ మిషనింగ్ టెక్నిషియన్, మెకానిక్ ఎలక్ర్టిక్ వెహికల్,
ఎలక్ర్టీషియన్.
ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులు
ఏటీసీల్లోని 6 కోర్సులు ఉపాధి అవకాశాలు కల్పించేవి. విద్యార్థుల నైపుణ్యాలు పెంచేలా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేస్తోంది. బిచ్కుందలో ఏటీసీ ప్రారంభం కాగా, తాడ్వాయి, ఎల్లారెడ్డిలో కౌన్సిలింగ్కు అవకాశం ఇచ్చారు. ఈ నెల 31 వరకు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. సీట్లు మిగిలితే మూడో విడత కౌన్సిలింగ్ లేదా నేరుగా ప్రవేశాలకు అవకాశం ఉంది. - ప్రమోద్కుమార్, జిల్లా కన్వీనర్