
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ కలెక్టర్గా టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ అంకిత్ (లోకల్ బాడీస్) పూలబొకేతో స్వాగతం చెప్పారు. పలు శాఖల అధికారులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ (రెవెన్యూ), బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, ఏవో ప్రశాంత్ తదితరులు ఉన్నారు. స్టేట్ క్యాడర్కు చెందిన వినయ్ కృష్ణారెడ్డి 2013లో ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యారు.
జనగామ, నల్గొండ కలెక్టర్గా పని చేశారు. హైదరాబాద్లో భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపు శాఖలో కమిషనర్గా పని చేస్తున్న ఆయనను ఇందూర్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు ఇక్కడ పని చేసిన రాజీవ్గాంధీ హనుమంతు స్పెషల్ సెక్రటరీ హోదాలో స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ శాఖకు కమిషనర్గా బదిలీ అయ్యారు. భూభారతి స్టేట్ ఆఫీసర్గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్డర్స్ జారీ కాగా, ఆయన కూడా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.