- అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా మ్యాచ్
టీ20 వరల్డ్ కప్ మ్యాచుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఒకే గ్రూప్ నుంచి భారత్ –పాక్ జట్లు బరిలోకి దిగుతుండడంతో ఈ జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో దాయాదుల సమరానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. వచ్చే అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ-20 ప్రపంచకప్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే.
చిరకాల ప్రత్యర్థులైన భారత పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ మాజాయే వేరు. క్రికెట్ ప్రేమికులు ఆ మజాను టోర్నీ ఆరంభమైన కొద్ది రోజుల్లోనే ఆస్వాదించే అవకాశం కలుగుతోంది. టీ20 ప్రపంచ కప్ కోసం ఐసీసీ విడుదల చేసిన జాబితాలో పాకిస్తాన్, భారత జట్లు గ్రూప్-2 నుంచి బరిలోకి దిగుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్లు ఈ ఏడాది దుబాయ్ వేదికగా అక్టోబర్ 24న జరగనున్న మ్యాచ్లో తలపడనున్నాయి.