కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మ్యారేజ్ లకు ఎంతమందిని అనుమతించాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు పెళ్లిళ్ల అనుమతి విషయంలో కలెక్టర్ నుంచి అనుమతి పొందాల్సి వచ్చేది. దీని కారణంగా అనుమతులు ఆలస్యం అవుతుండడంతో ఇకపై ఈ వ్యవహారాలను తహశీల్దార్ కు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ముఖ్యంగా జులై 21 నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుండడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ స్థాయిలో మ్యారేజ్ లకు పర్మిషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లిళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, మిగతా ఎటువంటి ఫంక్షన్లకు అనుమతి ఇచ్చేది లేదని ప్రభుత్వ నిబంధనల్లో తెలిపింది. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె తరపున కేవలం ఇరవై మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో చెప్పింది. పెళ్లిళ్ల అనుమతి కోరే వారు తప్పని సరిగా వివాహ శుభలేఖతో పాటు, నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పై అఫిడవిట్ ను తహశీల్దార్ కు సమర్పించాల్సి ఉంటుందని, దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తో పాటు, కరోనా పరీక్షలు చేయించుకున్నట్టుగా డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లను జత చేయాలని ప్రభుత్వం జీవోలో తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘింస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్ 188 ద్వార కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టంగా తెలిపింది.
పెళ్లిళ్లకు తహశీల్దార్ అనుమతి
- ఆంధ్రప్రదేశ్
- July 19, 2020
లేటెస్ట్
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
- Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!