నలుగురు కొడుకులున్నా అనాధల్లా మిగిలారు..
శేరిలింగంపల్లి, వెలుగు: చందానగర్ డివిజన్న్యూ పీఏనగర్చెందిన విమలమ్మ, రమేష్ దంపతులు తమను చంపేయాలని డాక్టర్లను, ప్రభుత్వాన్ని కోరారు. 70 ఏళ్లవయస్సులో వృద్ధాప్యంతో పాటు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని, తమకు విముక్తి కలిగించాలని అంటున్నారు. విమలమ్మ, రమేష్ దంపతులకు నలుగురు కొడుకులు. అందరూ బాగానే స్థిరపడ్డారు. అయినా వీరి బాగోగులు చూడడంలేదు. తల్లిదండ్రులను చూసుకోగలిగిన స్థిమందతులైనా తమను పలకరించేందుకు కూడా రాకపోవడం ముసలి దంపతులను మరింత కుంగదీస్తోంది. కేసీఆర్ అన్నా, టీఆర్ఎస్ అన్నా వల్లమాలిన అభిమానం ఉన్న వీరు ప్రభుత్వ పథకాల ప్రచారం చేశారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. వీరి సేవలను గుర్తించి మియాపూర్లో గతంలో జరిగిన మన నగరం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ఈ దంపతులకు స్వచ్ఛ దూత, బెస్టు వర్కర్ అవార్డులు అందజేశారు. అవార్డులిచ్చి సత్కరించిన మంత్రి కేటీఆర్అయినా తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
For More News..