హీరోయిన్‌‌గా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నా : డింపుల్ హయతి

హీరోయిన్‌‌గా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నా :  డింపుల్ హయతి

గద్దలకొండ గణేష్, ఖిలాడీ చిత్రాలతో ఆకట్టుకున్న డింపుల్ హయతి.. ఇప్పుడు ‘రామబాణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ డైరెక్షన్‌‌లో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా డింపుల్ ఇలా ముచ్చటించింది.


‘‘ఇందులో భైరవి అనే అర్బన్ అమ్మాయిగా కనిపిస్తా. రవితేజతో ‘ఖిలాడీ’ సినిమా చేస్తున్నప్పుడే దీనికి సైన్ చేశా. అందులో గ్లామరస్‌‌గా కనిపించడంతో ఇందులోని భైరవి పాత్రకు సరిపోతానో లేదో అనుమానం వ్యక్తం చేశారు. అందుకే రెండుసార్లు స్క్రీన్ టెస్ట్ చేసి, నమ్మకం కుదిరాక ఓకే చేశారు. 


భైరవి ఓ యూట్యూబర్. నిజ జీవితంలో నేను సోషల్ మీడియాకి దూరం. అందుకే ఈ పాత్ర కొత్తగా అనిపించింది. ఇందులో సీనియర్ ఆర్టిస్ట్‌‌లతో కలిసి వ్లాగ్ చేయడం ఎంటర్ టైనింగ్‌‌గా ఉంటుంది. సినిమా కూడా అందరినీ అలరించే ఎంటర్‌‌‌‌టైనర్. సెట్‌‌లో గోపీచంద్ గారు చాలా తక్కువగా మాట్లాడతారు. వర్క్‌‌పై ఎక్కువ ఫోకస్డ్‌‌గా ఉంటారు. చాలా సపోర్ట్ చేశారు. సెట్ ఎప్పుడూ ఓ పది మంది ఆర్టిస్టులతో కళకళలాడుతుండేది. 

ఈ జర్నీలో ఖుష్బూ గారు నాకు సెకండ్ మదర్‌‌‌‌లా అయిపోయారు. శ్రీవాస్ గారు ప్రతీది చాలా వివరంగా చెప్తారు. అది ఎంతో హెల్ప్ అయింది. ఇక నేను హీరోయిన్‌‌గా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాను. ఇంకా ప్రూవ్ చేసుకోవలసినది చాలా వుంది. అన్నిరకాల పాత్రలూ చేయాలని ఉంది. తమిళ్‌‌లో ప్రభుదేవా, విశాల్ గారితో నటించాను. అలాగే బాలీవుడ్‌‌లో ఓ సినిమా చేశా. తెలుగులో ఒకటి, తమిళ్‌‌లో ఒకటి పెద్ద సినిమాలు చేస్తున్నా. త్వరలోనే అనౌన్స్ చేస్తారు’’.