
- మల్లన్న గుడిలో జాతర
తమన్నా లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓదెల 2’. దర్శకుడు సంపత్ నంది కథను అందిస్తుండగా అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. హైదరాబాద్లో బోనాల సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఎర్రని చీర, తలపై బోనంతో కనిపించింది తమన్నా. షూటింగ్లో భాగంగా ప్రస్తుతం బోనాల ఎపిసోడ్ను చిత్రీకరిస్తున్నారు.
ఆర్ఎఫ్సిలో వేసిన ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో క్లైమాక్స్కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. 800 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఇతర నటీనటుల మధ్య తమన్నాపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు ఇది సీక్వెల్. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి ఇతర
ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.