లాస్ట్‌‌ బాల్‌‌కు సిక్సర్‌‌

లాస్ట్‌‌ బాల్‌‌కు సిక్సర్‌‌

న్యూఢిల్లీ: లాస్ట్‌‌ బాల్‌‌ వరకు థ్రిల్లింగ్‌‌గా సాగిన సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీ ఫైనల్లో.. డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ తమిళనాడు విన్నర్‌‌గా నిలిచింది. లాస్ట్‌‌ బాల్‌‌కు 5 రన్స్‌‌ అవసరమైన దశలో... పవర్‌‌ హిట్టర్‌‌ షారూక్‌‌ ఖాన్‌‌ (15 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్సర్లతో 33 నాటౌట్‌‌) సూపర్‌‌ సిక్సర్‌‌ కొట్టాడు.  దీంతో సోమవారం జరిగిన టైటిల్‌‌ ఫైట్‌‌లో తమిళనాడు 4 వికెట్ల తేడాతో కర్నాటకపై గెలిచింది. అత్యధికంగా మూడోసారి ట్రోఫీ నెగ్గి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్​లో టాస్‌‌ ఓడి మొదట బ్యాటింగ్‌‌ చేసిన కర్నాటక 20 ఓవర్లలో 151/7 స్కోరు చేసింది. అభినవ్‌‌ మనోహర్‌‌ (46) టాప్‌‌ స్కోరర్‌‌. ప్రవీణ్‌‌ దూబే (33), కరుణ్‌‌ నాయర్‌‌ (18), సుచిత్‌‌ (18) ఓ మాదిరిగా ఆడారు. తమిళనాడు బౌలర్లలో  సాయి కిశోర్‌‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్​లో తమిళనాడు 20 ఓవర్లలో 153/6 స్కోరు చేసి గెలిచింది. చివరి ఓవర్లో 16 రన్స్‌‌ అవసరం కాగా ప్రతీక్‌‌ జైన్‌‌ (1/34) బౌలింగ్‌‌లో సాయి కిశోర్ (6 నాటౌట్‌‌) ఫోర్‌‌ సహా ఫస్ట్ ఐదు బాల్స్‌‌కు 11 రన్స్‌‌ వచ్చాయి. ఇక లాస్ట్‌‌ బాల్‌‌కు సిక్సర్‌‌ అవసరం కాగా 26 ఏళ్ల షారూక్‌‌  కూల్‌‌గా డీప్‌‌ స్క్వేర్‌‌ లెగ్‌ మీదుగా సిక్స్​ కొట్టి హీరో అయ్యాడు.  స్టార్టింగ్‌‌లో హరి నిషాంత్‌‌ (23), నారాయణ్‌‌ జగదీశన్‌‌ (41)  రాణించారు. షారూక్‌‌కే ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.