Sriramana: వెండితెరపై బంగారు మురుగు.. ‘మిథునం’ వంటి కథతో వస్తోన్న తనికెళ్ల భరణి..

Sriramana: వెండితెరపై బంగారు మురుగు.. ‘మిథునం’ వంటి కథతో వస్తోన్న తనికెళ్ల భరణి..

నటుడిగానే కాక రచయితగా, దర్శకుడిగానూ తనదైన ముద్రవేసుకున్నారు తనికెళ్ల భరణి. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారాయన. తాజాగా స్వర్గీయ శ్రీరమణ రాసిన ‘బంగారు మురుగు’నవల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో తనికెళ్ల భరణి నటిస్తున్నారు.

ఈ సినిమాకు డొక్కా ఫణి దర్శకత్వం వహిస్తుండగా, ఫణీంద్ర గొల్లపల్లి నిర్మిస్తున్నారు. కోనసీమలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి  సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

రచయిత శ్రీరమణకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది.ఆయన రాసిన ‘మిథునం’కథ ఎంతో పాపులర్. ఆ కథను అదే పేరుతో తనికెళ్ల భరణి సినిమాగా తెరకెక్కించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ జంటగా నటించిన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. దీంతో ఈ సినిమాపైనా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 

తెలుగు సాహిత్యంలో అద్భుతమైన కథలు ఉన్నాయి. అయితే వాటిని ప్రేక్షకామోదకరంగా తెరకెక్కించే దర్శకులే కరువయ్యారు. మన దర్శకులు తెలుగు కథల మీద ఒకసారి దృష్టి సారిస్తే... కథలు కరువు అనే మాటే వినిపించదు.