మహారాష్ట్ర లో ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలోని హడప్ సర్ పారిశ్రామిక ప్రాంతానికి మద్యం లోడ్తో ఓ ట్యాంకర్ బయల్దేరింది. మే 8 రాత్రి 8.30 నిమిషాలకు పుణె–సాస్వాద్ రోడ్ లోని డైవ్ ఘాట్ కి రాగానే ట్యాంకర్ బ్రేక్ ఫెయిల్ అయింది.
వాగులో పడి..
అదుపు తప్పిన ట్యాంకర్ రెండు బైక్లపైకి దూసుకెళ్లింది. అనంతరం 50 అడుగుల లోతున్న వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్ డ్రైవర్తో పాటు మరొకరికి గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు.