మద్యం తరలిస్తున్న ట్యాంకర్​ బోల్తా.. ఇద్దరి మృతి

మద్యం తరలిస్తున్న ట్యాంకర్​ బోల్తా.. ఇద్దరి మృతి

మహారాష్ట్ర లో ట్యాంకర్​ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలోని  హడప్ సర్​ పారిశ్రామిక ప్రాంతానికి మద్యం లోడ్​తో ఓ ట్యాంకర్​ బయల్దేరింది. మే 8 రాత్రి 8.30 నిమిషాలకు పుణె–సాస్వాద్​ రోడ్ లోని డైవ్​ ఘాట్ కి రాగానే ట్యాంకర్​ బ్రేక్​ ఫెయిల్ అయింది.

వాగులో పడి..

అదుపు తప్పిన ట్యాంకర్​ రెండు బైక్​లపైకి దూసుకెళ్లింది.  అనంతరం 50 అడుగుల లోతున్న వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్​ డ్రైవర్​తో పాటు మరొకరికి గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు.