యాదాద్రి వెలుగు: ఆత్మకూరు (ఎం) మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తొల్పునూరి చంద్రయ్య రెండు బావులు, ఒక బోరు మోటారు ఉండడంతో 5 ఎకరాల్లో వరి సాగు చేశాడు. భూగర్భజలాలు అడుగంటిపోవడం, ఎండలు తీవ్రమవడంతో పొలం కొద్దికొద్దిగా ఎండిపోతోంది. వరి పంట కంకుల దశలో ఉండటంతో మరికొన్ని తడులు ఇస్తే చేతికొస్తుందన్న ఆశతో ఒక ట్యాంకర్కు రూ. 700 చొప్పున వెచ్చించి ఇలా నీటిని పోయిస్తున్నాడు. బుధవారం ఒక్కరోజే నాలుగు ట్యాంకర్లతో పంటకు తడులు అందించాడు. పంట చేతికందేవరకు రోజు విడిచి రోజు ఇలా నీటిని అందిస్తానని తెలిపారు.
చందుపట్లలో
భువనగిరి మండలంలోని చందుపట్లలో రైతు మల్లారెడ్డి.. తన వ్యవసాయ భూమిలోని 3 ఎకరాల్లో వరి పంట వేశాడు. ఇతడిదీ సేమ్ పరిస్థితి. 2 బోర్లల్లో నీళ్లు రావడంలేదని.. దీంతో పొట్టకొచ్చిన పంటను ఎలాగైనా దక్కించుకోవాలని ట్యాంకర్ తో తడులు పెడుతున్నట్లు తెలిపాడు.