
మేడిపల్లి, వెలుగు: పాఠ్య పుస్తకాల్లో సిలబస్ మార్చుతూ, మూఢ నమ్మకాలు పెంపొందించేలా జరుగుతున్న విద్య కాషాయీకరణను వ్యతిరేకిస్తూ స్టూడెంట్లు పోరాడాలని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ కాసీం పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగినశిక్షణా తరగతుల ముగింపు ప్రోగ్రామ్ బుధవారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు.
మతోన్మాదం, లౌకికవాదం అనే అంశాలపై ప్రొఫెసర్లు క్లాస్లు బోధించారు. చదువు అనే ఆయుధాన్ని చేతపట్టి స్టూడెంట్లు సమాజాన్ని మార్చాలని కోరారు. అనంతరం సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి పాటలు పాడి అలరించారు. శిక్షణా తరగతుల్లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు శివరామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.