హైదరాబాద్, వెలుగు: ఆగస్టు1న తపస్ ఆధ్వర్యంలో నిర్వహించే మహా ధర్నా పోస్టర్ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్య, ఆ సంఘం నేతలు ఆదివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వొద్నాల రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్య మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్లో ఉన్న పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేసి 51 శాతం ఫిట్, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయుల వార్షిక పదోన్నతులు, బదిలీల క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. ఈహెచ్ఎస్ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని అన్ని గుర్తింపు పొందిన సంఘాలకు ట్రస్ట్లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 1న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాలో టీచర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తపస్ సంఘం నేతలు పిలుపునిచ్చారు.
