తారకరత్న సొంతంగానే ఊపిరి పీల్చుకుంటుండు: నందమూరి రామకృష్ణ

తారకరత్న సొంతంగానే ఊపిరి పీల్చుకుంటుండు: నందమూరి రామకృష్ణ

తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని..అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయని నందమూరి రామకృష్ణ అన్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామకృష్ణ..  తారకరత్న వెంటిలెటర్ పై ఉన్నారని చెప్పారు. న్యూరాలజిస్ట్ అబ్జర్వేషన్ లో ఉన్నారని  ఎక్మో పెట్టలేదన్నారు. ఎక్మో పెట్టారనేది అవాస్తవం అని చెప్పారు. తారకరత్న  సొంతంగానే ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. సిటీ స్కాన్ రిపోర్ట్ ఇంకా రాలేదన్నారు. సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చాక మెదడు పని తీరుపై క్లారిటీ వస్తుందన్నారు. త్వరలోనే తారకరత్న నవ్వుతూ బయటకి వస్తారని..కాకపోతే ఇంకా సమయం పడుతుందన్నారు.