మందమర్రి,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని దోచుకుంటోందని, దీనికి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నిర్వాకమే కారణమని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. గురువారం మందమర్రి ఏరియా కేకే5 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.వీరభద్రయ్యతో కలిసి మాట్లాడారు. సర్కార్వేల కోట్ల సంస్థ ఫండ్స్ను తరలించడంతో సింగరేణికి ప్రమాదం పొంచిఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులు కాలరాస్తున్నాయన్నారు. టీబీజీకేఎస్ లీడర్లు బ్రోకర్లుగా మారి మెడికల్ అన్ ఫిట్ పేరుతో లక్షల్లో దండుకుంటున్నారని పేర్కొన్నారు. సంస్థలో వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇంటర్నల్ఎంప్లాయీస్ తో భర్తీ చేయాలన్నారు. వందేళ్లు దాటిన టీబీజీకేఎస్ వేజ్బోర్డు సంఘం కాదన్నారు. ఈ సందర్భంగా కేకే5 గని హెడ్ ఓవర్మెన్, ఏఐటీయూసీ లీడర్ కొత్త తిరుపతి ఆధ్వర్యంలో100 మంది యువ ఉద్యోగులు ఏఐటీయూసీలో చేరారు. కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.వీరభధ్రయ్య, బ్రాంచి సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, ఎండీ అక్బర్ అలీ, దాగం మల్లేశ్, వైస్ ప్రెసిడెంట్లుభీమనాధుని సుదర్శనం, ఇప్పకాలయ లింగయ్య, లీడర్లు రాజేశం, ప్రసాద్, మల్లయ్య, సమ్మయ్య, కొండయ్య, రాజ్కుమార్, సంపత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.