
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ టీసీఎస్ తన ఏఐ డాట్ క్లౌడ్ బిజినెస్ యూనిట్ను రెండు సపరేట్ విభాగాలుగా విభజించింది. ఇందులో ఒక బిజినెస్ యూనిట్ ఏఐ సెగ్మెంట్ను, మరొకటి క్లౌడ్ సెగ్మెంట్ను కవర్ చేస్తుంది. సుమారు రెండేళ్ల క్రితం ఏర్పడిన ఏఐడాట్క్లౌడ్ బిజినెస్ టీసీఎస్ యావరేజ్ గ్రోత్ కంటే ఎక్కువ వృద్ధి నమోదు చేసింది. అందుకే ఈ సెగ్మెంట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని కంపెనీ భావిస్తోంది.
ఏఐ బిజినెస్ అయిన ఏఐ డేటా యూనిట్ను ఏఐడాట్క్లౌడ్ హెడ్ శివ గణేశన్ నడుపుతారు. ఆయన మాట్లాడుతూ, ‘‘ ఏఐ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఇది ముందు ముందు మరింత విస్తరిస్తుంది”అని చెప్పారు. “గత 12 నెలల్లో ఏఐ, డేటా స్పేస్లో మేం చూస్తున్న యాక్టివిటీ వాల్యూమ్ చాలా రెట్లు పెరిగింది” అని అన్నారు. కానీ ఏఐ బిజినెస్ నుంచి వచ్చిన రెవెన్యూ వివరాలను బయటపెట్టలేదు. క్లౌడ్ యూనిట్ను డిప్యూటీ హెడ్ కృష్ణ మోహన్ నడుపుతారు.