
IT News: ప్రస్తుతం కొనసాగుతోంది ఏఐ యుగం. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అనే పదానికి కార్పొరేట్ ప్రపంచంలో ప్రస్తుతం చోటే లేదు. రోజురోజుకూ మారిపోతున్న టెక్నాలజీ, దానికి అనుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు భారతీయ ఐటీ రంగంలోని కంపెనీలు సైతం ప్రస్తుతం వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఐబీఎం, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఏఐ వినియోగంతో ఖర్చులను తగ్గించుకోవటం, వర్క్ ఎఫీషియన్సీని పెంచటం వంటి పనిలో నిమగ్నమై ఉన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారీగా ఏఐ ఏజెంట్లను పనిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇది ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు అదనంగా ఏకకాలంలో పనిచేయనున్నాయని చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు.
ALSO READ | Layoffs: మైక్రోసాఫ్ట్ బాటలో.. వందలాదిమందిని తొలగించిన లింక్డ్ఇన్
వాస్తవానికి జనరేటివ్ ఏఐ అనేది కొత్త టెక్నాలజీ సైకిల్ కాదని ఇది మానవజాతి కోరుకుంటున్న మార్పుగా చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో వ్యాపారాలు, ఐటీ రంగంలోని సంస్థలు తన వ్యవస్థలను మరింత సమర్థవంతంగా ఆటోమేట్ చేసేందుకు ముందుకెళుతున్నట్లు ఏఐ యుగంలో అర్థం అవుతోందని ఆయన అన్నారు. అందుకే తాము కూడా ఏఐ ఏజెంట్ల వినియోగానికి నిర్ణయించినట్లు షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో చంద్రశేఖరన్ వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నందున పని ప్రభావవంతంగా మార్చేందుకు ఏఐని వినియోగిస్తున్నట్లు చెప్పారు. 2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 30 బిలియన్ డాలర్ల వ్యాపార మైలురాయిని అధిగమించిందని చెప్పారు. అందుకే కంపెనీ ప్రస్తుతం కొత్త టెక్నాలజీలతో పనిచేయటం ఉత్తమ బెంచ్ మార్క్ ఐటీ సేవలను అందించటంపై దృష్టి పెట్టిందని చెప్పారు చంద్రశేఖరన్. ఇలాంటి వాతావరణంలో ఐటీ ఉద్యోగులకు జాబ్స్ ఖచ్చితంగా సేఫ్ అనే అంశం కాలం నిర్ణయాల్సిన విషయమేనని నిపుణులు అంటున్నారు.