కాపు కాసి చంపేశారు : టీడీపీ నేత దారుణ హత్య

కాపు కాసి చంపేశారు : టీడీపీ నేత దారుణ హత్య

కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణహత్యకు గురయ్యారు. జిల్లాలోని డోన్‌ మండలం మల్లెంపల్లిలో బుధవారం రోజున టీడీపీకి చెందిన శేఖరరెడ్డిని ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి చంపారు. తాపలకొత్తూరు నుంచి బైక్ పై డోన్‌ వెళ్తుండగా కొందరు గుర్తు తెలయని దుండగులు ఈ  హత్య చేశారు. మృతి చెందిన వ్యక్తి ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచరుడని తెలిసింది.   ప్రత్యర్ధుల దాడిలో తీవ్రరక్తస్రావం అయిన శేఖర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దుండగులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.

తాపలకొత్తూరు వద్ద శేఖరరెడ్డి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు భౌతికకాయాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.గురువారం  ఎన్నికల ఫలితాల విడుదలయ్యే ఒక్కరోజు ముందు ఈ హత్య జరగడంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.