ఆస్పత్రిలో నారా లోకేష్..ఎంఆర్ఐ స్కాన్ చేసిన డాక్టర్లు

ఆస్పత్రిలో నారా లోకేష్..ఎంఆర్ఐ స్కాన్ చేసిన డాక్టర్లు

టీడీపీ నాయకుడు నారా లోకేష్ గత కొద్దిరోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన మే 18వ తేదీ నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుడి చేతి భుజానికి స్కానింగ్ చేయించడం కోసం వెళ్లారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించిన సందర్భంగా ప్రజలు, కార్యకర్తల భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ సమయంలోనే సెల్ఫీ కోసం అభిమానులు ఆయన భుజాన్ని బలంగా లాగడంతో గాయమైంది.

అప్పటి నుండి నొప్పితో బాధపడుతూనే లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే ఫిజియథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రతలు తీసుకున్నా నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో లోకేష్ మరోసారి వైద్యులను సంప్రదించారు. 50 రోజులు దాటిపోయినా ఇంకా నొప్పి తగ్గకపోవడంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలని డాక్టర్ల సూచించారు. ఈ మేరకు నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ వచ్చిన లోకేష్ కుడి భుజానికి ఏంఆర్ఐ స్కాన్ చేశారు.