చంద్రబాబుకు బొకే ఇవ్వమన్న గల్లా..ఇయ్యనన్న కేశినేని

చంద్రబాబుకు బొకే ఇవ్వమన్న గల్లా..ఇయ్యనన్న కేశినేని

టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని అంశం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి ఫుష్పగుచ్చం అందించారు. అయితే చంద్రబాబుకు బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ కేశినానికి ఇవ్వబోయాడు. ఈ క్రమంలో నాని బొకేను అసహనంతో తోసేశాడు. పార్టీ అధినేత ముందే నాని ఈ విధంగ వ్యవహరించడం హాట్ టాపిక్ గా మారింది. 

కాగా గత కొలంగా నాని టీడీపీతో అంటిముట్టన్నట్లుగా ఉంటున్నారు. తన తమ్ముడిని టీడీపీ ప్రోత్సహించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. నాని తమ్ముడు చిన్ని కూడా విజయవాడ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. తనకు కాకుండా తన తమ్ముడికి పార్టీ టికెట్ ఇస్తుందేమోననే అసహనంలో నాని ఉన్నారు. మొన్న తన కూతురు నిశ్చితార్థానికి వచ్చిన చంద్రబాబు, లోకేష్ తో నాని ఉత్సాహంగానే కన్పించారు. ఇంతలోనే ఈ విధంగా వ్యవహరించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాగా అజాదీ కా అమృతోత్సవ్ నేషనల్ కమిటీ కార్యక్రమంలో పాల్గొంనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం జరగనుంది.