ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కారును నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ధ్వంసం చేశారు దుండగులు.  విజయవాడ గురునానక్ కాలనీలోని తన నివాసం వద్ద పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు పగలకొట్టి వెళ్లారు. ఉదయమే కారును పరిశీలించిన పట్టాభి ఘటనపై స్పందించారు.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నందున వైఎస్ఆర్ పార్టీకి చెందిన వారు  ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పట్టాభి ఆరోపించారు. తన ఇంటి పక్కపూ హైకోర్టు జడ్జి ఇల్లు కూడా ఉందని… అక్కడ పోలీస్ పికెట్ ఉంది. వారికి అన్నీ కనిపించే అవకాశం ఉంది. దుండగులు ఎక్కడో సర్వే రాళ్లు తీసుకువచ్చి నా కారు పగలగొట్టారన్నారు. తన కారు ధ్వంసం చేస్తే భయపడే పిరికిపందను కాదని పట్టాభి తెలిపారు.  పోలీసులు పట్టాభి నివాసానికి వచ్చి ధ్వంసమైన కారును పరిశీలించారు.