మహబూబ్నగర్ జిల్లా సోషల్వెల్ఫేర్ గురుకులంలో ఘటన
మరికల్, వెలుగు : మహబూబ్నగర్ జిల్లా మరికల్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి స్టూడెంట్ను హోంవర్క్చేయలేదని టీచర్ కర్రతో కొట్టడంతో గాయపడింది. మండల కేంద్రంలోని గురుకుల స్కూల్లో స్వాతి 5వ తరగతి చదువుతోంది. ఈనెల 2న ఇంగ్లీష్ హోంవర్కు చేయకపోవడంతో ఐదుగురిని టీచర్శైలజ కర్రతో అరచేతులు, మట్టలపై కొట్టింది. స్వాతి చేతులకు వాపు రావడంతో అదే రోజు రాత్రి క్లాస్టీచర్తల్లిదండ్రులకు ఫోన్చేసి మీ బిడ్డకు జ్వరం వచ్చిందని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పింది.
మరుసటి రోజు తల్లిదండ్రులు రాగా ఇంగ్లిష్టీచర్శైలజ కొట్టిందని చెప్పింది. దీంతో ప్రిన్సిపాల్దగ్గరకు వెళ్లి ప్రశ్నించారు. ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. తర్వాత దవాఖానాకు తీసుకువెళ్లారు. మంగళవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ తాము స్కూల్లో కర్రలు వాడమని, స్టూడెంట్స్ను కొట్టమని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అశోక్బాబు తెలిపారు.