హైదరాబాద్‎లో దారుణం.. రెండో తరగతి బాలుడిపై టీచర్చిత్రహింసలు

హైదరాబాద్‎లో దారుణం.. రెండో తరగతి బాలుడిపై టీచర్చిత్రహింసలు

ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, వెలుగు: రెండో తరగతి చదువుతున్న చిన్నారిపై ఓ టీచర్​అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి బంధువులు తెలిపిన ప్రకారం.. ఎల్బీనగర్ మన్సూరాబాద్ లోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‎లో సాయినందన్  రెండో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా స్కూల్​కు వెళ్లమంటే భయపడుతున్నాడు. తల్లిదండ్రులు స్కూల్​వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించారు. 

సాయినందన్ నోటికి టేపు చుట్టి, పెన్సిల్‎తో కండ్లలో కుచ్చుతూ టీచర్​వేధించినట్లు కనిపించిందని తల్లిదండ్రులు ఆరోపించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు. మరోవైపు బోరబండ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఎర్రగడ్డ మేడరన్​సిటీ స్కూల్‎లో ఒకటో తరగతి చదువుతున్న రియాన్​ఖాన్‎ను టీచర్​ వీపుపై విచక్షణా రహితంగా కొట్టాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.