
- బదిలీలు, ప్రమోషన్ల కోసమేనని యూఎస్పీసీ వెల్లడి
హైదరాబాద్ : దసరా సెలవుల్లో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. దీనికోసం వచ్చే నెల 4న జిల్లా కేంద్రాల్లో టీచర్ల సామూహిక నిరాహార దీక్షలు చేపడతామని తెలిపింది. రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ ధర్నాచౌక్లో సెప్టెంబర్ 11 నుంచి బదిలీల షెడ్యూల్ ఇచ్చేదాకా రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.
తమ డిమాండ్లపై దశలవారీ ఆందోళaనలు చేయాలని ఆదివారం హైదరాబాద్లో జరిగిన యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించింది. విద్యారంగ సమస్యలపై సీఎం కేసీఆర్ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని నేతలు డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న పింఛన్ విద్రోహ దినాన్ని నిర్వహిస్తామని, ఈ సందర్భంగా టీచర్లంతా నల్లబ్యాడ్జీలతో అటెండ్ కావాలని యూఎస్పీసీ నేతలు కోరారు.