![పోస్టల్ బ్యాలెట్ ఇవ్వలేదంటూ .. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద టీచర్ల నిరసన](https://static.v6velugu.com/uploads/2023/11/22_6xkAnj4I0o.jpg)
- వేములవాడ జూనియర్ కాలేజీలో ఆందోళన
వేములవాడ, వెలుగు : అందరికీ ఓటు వేయాలని చెప్పే తమనే ఆ హక్కుకు దూరం చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో టీచర్లు నిరసన తెలిపారు. బుధవారం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఎలక్షన్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు డ్యూటీ కోసం వచ్చిన టీచర్లు తమకు బ్యాలెట్ ఓటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఇంతవరకు తమకు పోస్టల్బ్యాలెట్ రాలేదన్నారు. ఓటు హక్కు కల్పించకపోవడంపై అధికారులు సమాధానం చెప్పాలన్నారు.
నాలుగు రోజులుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా స్పందించలేదన్నారు. డ్యూటీ సక్రమంగా చేయకపోతే అధికారులు చర్యలు తీసుకుంటారని, ఘటనకు బాధ్యలుపై ఎవరు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. తమకు పోస్టల్బ్యాలెట్ హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.