టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్న నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో రోహిత్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇవాళ BCCI ట్వీట్ చేసింది. ప్రస్తుతం BCCI మెడికల్ టీం పర్యవేక్షణలో ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. అయితే జూలై 1 నుంచి ఇంగ్లాడ్ తో టెస్టు క్రికెట్ మ్యాచ్ జరగనుంది. టెస్టుకు ముందే రోహిత్ కు పాజిటివ్ రావడం టీమిండియాకు భారీ షాక్ అనే చెప్పొచ్చు. ఇక జూలై 1 నుంచి జరగబోయే ఇంగ్లాడ్ మ్యాచ్ లో రోహిత్ పాల్గొంటారా లేదా అనే విషయాన్ని BCCI క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
రోహిత్ శర్మ ప్రస్తుతం టీసెస్టర్ జట్టుతో జరుగుతోన్న వార్మప్ మ్యాచ్ లో ఆడుతున్నాడు. గురువారం జరిగిన తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన ఆయన 25 పరుగులు చేశాడు. శనివారం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయలేదు. రోహిత్ కు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా ఆటగాళ్లలో ఆందోళన మొదలైంది.
Team India Captain Rohit Sharma has tested positive for #COVID19 following a Rapid Antigen Test conducted on Saturday, June 25. He is currently in isolation at the team hotel and is under the care of the BCCI Medical Team: BCCI
— ANI (@ANI) June 25, 2022
(file pic) pic.twitter.com/8TKDE0vnuJ