ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీమిండియా వామప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీమిండియా వామప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సొంతగడ్డపై జరిగే వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్లతో వామప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్​లు ఆడనుంది. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30న గువాహతిలో జరిగే తొలి ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరులో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో, అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30న తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రెండో వామప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీ పడనుంది. 

మొత్తంగా పది జట్లు ఆడే అధికారిక వామప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు గువాహతి, తిరువనంతపురం, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆతిథ్యం ఇస్తాయన్న ఐసీసీ బుధవారం షెడ్యూల్​ ఖరారు చేసింది. అన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతాయని తెలిపింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌5న అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెగా టోర్నీ షురూ అవనుంది. కాగా, వరల్డ్​ కప్​ టికెట్ల విక్రయాల కోసం బుక్​మైషో సంస్థతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. మెగా టోర్నీకి టికెటింగ్​ పార్ట్​నర్​గా బుక్​మైషో ఉంటుందని బోర్డు ప్రకటించింది. ఐసీసీ ఖరారు చేసిన తేదీల్లో టికెట్లు  బుక్​మైషోలో ఉంటాయి.