ఆక్లాండ్: స్టార్లు లేకుండా బరిలోకి దిగిన టీమిండియాకు న్యూజిలాండ్ టూర్లో తొలి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాటర్లు సూపర్ పెర్ఫామెన్స్తో మంచి స్కోరు చేసినా.. అనుభవం లేని బౌలర్లు దాన్ని కాపాడుకోవడంలో ఫెయిలయ్యారు. ఇండియా కుర్ర బౌలర్లపై కివీస్ బ్యాటర్లు టామ్ లాథమ్ (145 నాటౌట్) , కేన్ విలియమ్సన్ (94 నాటౌట్) పంజా విసిరారు. దాంతో, మూడు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో చిత్తయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ధవన్సేన 50 ఓవర్లలో 306/7 స్కోరు చేసింది. శ్రేయస్ అయ్యర్ (80), ఓపెనర్లు ధవన్ 72), శుభ్మన్ గిల్ (50) ఫిఫ్టీలతో రాణించారు.
రిషబ్ పంత్ (15), సూర్యకుమార్ యాదవ్ (4) నిరాశ పరచగా..సంజు శాంసన్ (36), చివర్లో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (16 బాల్స్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్) సత్తా చాటాడు.ఆతిథ్య బౌలర్లలో టిమ్ సౌథీ, లోకి ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్లో న్యూజిలాండ్ 47.1 ఓవర్లలోనే 309/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఫిన్ అలెన్ (22), డెవాన్ కాన్వే (24), డారిల్ మిచెల్ (11) ఫెయిలైనా.. కెప్టెన్ కేన్, లాథమ్ నాలుగో వికెట్కు 221 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడంతో కివీస్ సునాయాసంగా టార్గెట్ను అందుకుంది. ఈ మ్యాచ్తో వన్డే డెబ్యూ చేసిన ఉమ్రాన్ మాలిక్ (2/66) రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. అర్ష్దీప్ సింగ్ (0/68) నిరాశ పరిచాడు. లాథమ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. రెండో వన్డే హామిల్టన్లో ఆదివారం జరుగుతుంది.
శిఖర్ @ 12 వేల రన్స్
ఈ మ్యాచ్లో ఫిఫ్టీ కొట్టిన శిఖర్ ధవన్ లిస్ట్–ఎ క్రికెట్ 12 వేల రన్స్ క్లబ్ చేరాడు. ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన ఏడో ప్లేయర్గా నిలిచాడు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్లో కలిపి 297 వన్డే మ్యాచ్లు ఆడిన ధవన్ 12,025 రన్స్ చేశాడు.