ముంబై: టెక్ మహీంద్రా, ఫిడే సంయుక్త భాగస్వామ్యంలో గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) మూడో సీజన్ ముంబైలోని రాయల్ ఒపేరా హౌస్లో అట్టహాసంగా ప్రారంభమైంది. నేటి నుంచి జరిగే 34 మ్యాచ్లలో ఆరు జట్లు గ్రాండ్ ప్రైజ్ కోసం పోటీపడతాయి. త్రివేణి కాంటినెంటల్ కింగ్స్, ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ మధ్య బ్లాక్బస్టర్ మ్యాచ్తో ఈ సీజన్ అధికారికంగా ప్రారంభమవుతుంది.
మహీంద్రా గ్రూప్ ఛైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, అర్జున్ ఎరిగైసి, ఆర్. ప్రజ్ఞానంద, హారికా ద్రోణవల్లి, అలీరెజా ఫిరౌజా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సీజన్ జీసీఎల్ లక్ష్యాలను ప్రపంచ స్థాయి ఆటగాళ్ల ఎంపిక ద్వారా సాధిస్తున్నదని చైర్పర్సన్ పీయూష్ దూబే తెలిపారు. విశ్వనాథన్ ఆనంద్తో పాటు అలీరెజా ఫిరౌజా, ఫాబియానో కరువానా, హికారు నకమురా, హౌ యిఫాన్ బరిలోకి దిగనున్నారు.
