సొంతూరుకు వెళ్తుండగా అస్వస్థత ఉరేసుకుని టెకీ సూసైడ్

సొంతూరుకు వెళ్తుండగా అస్వస్థత ఉరేసుకుని టెకీ సూసైడ్

గచ్చిబౌలి, వెలుగు: సొంతూరుకు వెళ్తుండగా అస్వస్థతకు గురైన ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం పట్టణం గాంధీనగర్ కు చెందిన చింతల యామిని(27) గచ్చిబౌలి ఇందిరానగర్ లోని ఓ పీజీ హాస్టల్​లో ఉంటూ సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పని చేస్తోంది. మంగళవారం సొంతూరు వెళ్లేందుకు ఉదయమే కాచిగూడ రైల్వే స్టేషన్​కు చేరుకుంది. 

స్టేషన్ వద్ద ఆమెకు వాంతులు అవ్వడంతో తిరిగి హాస్టల్ కు వెళ్లింది. చున్నీతో గ్రిల్​కు ఉరి వేసుకుని  సూసైడ్​ చేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆమె కాల్​ డేటాను పరిశీలిస్తున్నారు.